హిందూ మహాసముద్రంలో.. భారత్, అమెరికాలు
భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధవిన్యాసాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధనౌకలు పాలుపంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక థియోడోర్ రూజ్ వెల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహించింది. రూజ్వెల్ట్ నౌక అణుశక్తితో నడుస్తుంది. పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్ యుద్ధనౌకలు దీన్ని అనుసరించాయి. ఇండో`పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడిరది. భారత్ నౌకాదళం తరపున గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఇంధన ట్యాంకర్ ఐఎన్ఎస్ ఆదిత్య సహా అనేక వార్షిప్లు ఇందులో పాల్గొన్నాయి.






