India: భారత్-మారిషస్ మధ్య 8 కీలక ఒప్పందాలు
భారత్-మారిషస్ మధ్య వాణిజ్యం, తీరప్రాంత భద్రత తదితర అంశాలపై 8 కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని తాను, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర (Naveen Chandra ) నిర్ణయించినట్లు ప్రధాని మోదీ (Modi) తెలిపారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడులకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఐఎన్ఎస్ ఇంఫాల్ (INS Imphal) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత వైమానిక దళానికి చెందిన స్కై డైవింగ్ బృందం కూడా వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మోదీ దక్షిణార్థ గోళ దేశాల కోసం మహాసాగర్ పేరిట కొత్త విజన్ను ప్రకటించారు. మారిషస్ పార్లమెంట్ భవన (Parliament Building) నిర్మాణానికి భారత్ (India) సహకరిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్కు దీన్ని కానుకగా మోదీ అభివర్ణించారు. పర్యటనలో భాగంగా మోదీకి మారిషస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని బహూకరించింది.






