30 సెకన్లలోనే వైరస్ అంతం!
కరోనా వైరస్ ముక్కు నుంచి శ్వాసకోశ వ్యవస్థలోకి చొరబడకుండా అడ్డుకొని 30 సెకన్లలోనే తుదముట్టించగల శక్తిమంతమైన అయింట్మెంట్కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా దీన్ని నేరుగా విక్రయించేందుకు, వినియోగించేందుకు అనుమతులిచ్చింది. దీంతో కరోనాను నిరోధించగల తొలి అయింట్మెంట్గా ఏపీటీ టీ3క్స్ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీని అమెరికాలోని అడ్వాన్స్డ్ పెనెట్రేషన్ టెక్నాలజీ (ఏపీటీ) కంపెనీ తయారు చేసింది. కరోనా ఇన్ఫెన్షన్ కలిగినవారు ఈ అయింట్మెంట్ను ముక్కు పుటాల్లో రాసుకున్న ముప్ఫై సెకన్ల తర్వాత.. వైరస్ జాడ దాదాపు పూర్తి (99.9 శాతం) గల్లతైందని ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది. ఇది కరోనా వైరస్తో పాటు ఇన్ఫ్లూయెంజా వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్లపైనా సమర్థంగా పని చేస్తోందని గుర్తించారు.
లండన్లోని ప్రఖ్యాత వైరాలజీ రిసెర్చ్ సర్వీసెస్ లేబొరేటరీ సైతం ఈ అయింట్మెంట్ను పరీక్షించి, కరోనాపై అది ప్రభావవంతంగా పనిచేస్తోందని ధ్రువీకరించింది. నోరు, కళ్ల నుంచి కూడా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశాలున్నా, ముక్కు నుంచి చొరబడేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఇటీవల నిర్థారించారు. ఈ నేపథ్యంలో ఈ అయింట్మెంట్ అందుబాటులోకి రావడం ఆశాజనక పరిణామమే. అయితే లైమ్ వ్యాధి కలిగిన వారు దీన్ని వాడితే హెర్కస్ రియాక్షన్ తలెత్తే అవకాశాలుంటాని ఏపీటి తెలిపింది. అమెరికాలో దీని ధర రరూ.2,100 (29 డాలర్లు).






