దశలవారీగా ప్యాకేజి వివరాలు -నిర్మలా సీతరామన్
భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజి వివరాలను దశలవారీగా విడుదల చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి విడత ప్యాకేజి వివరాలు ఆమె బుధవారం దేశ ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే చేపట్టిన చర్యలను కూడా తెలిపారు. అన్ని వర్గాలకు మేలు కలిగేలా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకేజీ.
వివిధ మంత్రిత్వశాఖలతో చర్చించాక ప్యాకేజీకి రూపకల్పన చేశామని చెప్పారు. భారత దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగ పడుతుందన్నారు. ఎకానమీ, మౌలికరంగం, టెక్నాలజీ, వనరులపై దృష్టి సారించడం ద్వారా దీనిని సాధించనున్నామన్నారు. ఈ కరోనా సంక్షోభ కాలంలో 40 రోజుల్లో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇకపై స్వదేశీ బ్రాండ్ల తయారీ, అభివృద్ధి ఈ ప్యాకేజీ ఉద్దేశంగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడాలన్నారు.
ఇప్పటికే పీఎం కిసాన్ యోజన వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకున్నామని, ఉజ్వల వంటి పథకాలతో ప్రజలకు చేరువయ్యామని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే ముందు ఈ సంస్కరణలను అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు.
పేదలు, వలస కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నట్టు చెప్పారు. లాక్ డౌన్ తర్వాత గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ప్రకటించామని, ఇప్పటికే 41 కోట్ల జన్ ధన్ అకౌంట్లోకి రూ.52,606 కోట్లను నేరుగా జమచేశామని గుర్తు చేశారు. అలాగే 71 వేల టన్నుల ఆహారధాన్యాలను పంపిణీ చేశామని తెలిపారు.
ఉద్దీపన చర్యల్లో భాగంగా పలు చర్యలను ఆమె ప్రధానంగా పేర్కొన్నారు అవి…
– చిన్న, మధ్య తరహా కంపెనీలకు రూ.3 లక్షల కోట్లు కేటాయింపు
– MSME రుణాలకు కేంద్రం గ్యారంటీ
– ఎలాంటి పూచీకత్తు లేకుండా ఎంఎస్ఎంఈలకు రుణాలు
– అక్టోబర్ వరకు MSME లకు ఈ రుణ సదుపాయం
– ఈ రుణాలకు నాలుగేళ్ల కాలపరిమితి, ఏడాది మారటోరియం
– రూ.80 వేల కోట్ల విలువైన రీఫండ్స్






