లాలాజలంతో కరోనా పరీక్షలు
కరోనా నిర్ధారణ కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న గొంతు, ముక్కు ద్వారా నమూనాల (స్వాబ్) సేకరణ విధానంలో (ఆర్టీ-పీసీఆర్ వంటి టెస్టులు) పరీక్షా ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతున్నది. నమూనాలు సేకరించేవారికి ప్రమాదమే. ఈ నేపథ్యంలో అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు సలైవాడైరెక్ట్ అనే కరోనా పరీక్షల విధానాన్ని అభివృద్ధి చేశారు. లాలాజలంతో కొవిడ్ నిర్ధారణ జరిపే ఈ విధానానికి అమెరికా పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ (ఎఫ్డీఏ) అత్యవసర అనుమతులనిచ్చింది.
సలైవాడైరెక్ట్ లో రోగుల లాలాజలాన్ని పరీక్షిస్తారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పరీక్షలను చేసే వీలు ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్వాబ్ పరీక్షలకు సమానమైన కచ్చిత ఫలితాలు వస్తుండటంతో సలైవాడైరెక్ట్ పరీక్షలు గేమ్ ఛేంజర్ అని ఎఫ్డీఏ అభివర్ణించింది.






