తెలంగాణలో 1,682 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1682 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 235 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 93,937 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 8 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 711కు చేరింది. ఇవాళ 2,070 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 72,202 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 21,024 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 14,140 మంది ఉన్నారు. గడిచిన 24 గంటలో వ్యవధిలో 19,579 మందికి కొవిడ్ 19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,72,928 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.






