మరో వివాదంలో కమల్ హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహాభారతం, ద్రౌపదిపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు కష్టాలు తెచ్చాయి. వల్లియూర్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5న హాజరు కావాలని ఆదేశించింది. హిందూ మక్కల్ కట్చి ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. మహాభారతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ మతాన్ని కించపరిచేవిధంగా ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు.






