ఫిలిప్స్ కీలక నిర్ణయం… 4000 మంది ఉద్యోగులను
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 4000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఐదు శాతానికి సమానం. కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తీసుకోక తప్పడం లేదని సీఈవో రాయ్ జాకోబ్స్ అన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. మూడు నెలల వ్యవధిలో కంపెనీ విక్రయాల విలువ ఐదు శాతం తగ్గి 4.3 బిలియన్ యూరోలకు చేరింది. కంపెనీలో ఉత్పాదకతను పెంచడం కోసమే ఉద్యోగాల తొలగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జాకోబ్స్ తెలిపారు. దీన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.






