భవష్యత్లో ఎప్పుడూ ఆ సంస్థకు పని చేయను : డోర్సే
ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశంపై ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కీలక వ్యాఖ్యలు చేశారు. భవష్యత్లో ఎప్పుడూ ఆ సంస్థకు సీఈవోగా పనిచేయబోనని తేల్చి చెప్పారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత, డోర్సే మళ్లీ సీఈవోగా పని చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై డోర్సేను ప్రశ్నించగా అలాంటి ప్రసక్తే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ట్విటర్ను కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించిన మొదట్లో డోర్సే ఆయనకు మద్దతు పలికారు. ఆ తర్వాత మస్క్ సంచలన నిర్ణయాలతో బహిరంగ విమర్శలు చేశారు. ఉద్యోగాల కోత, ఫీచర్ల పేర్లు మార్పు వంటి అంశాలను ఆయన వ్యతిరేకించారు. 16 ఏళ్ల కిందట సహ వ్యవస్థాపకుడిగా ట్విట్టర్ను ప్రారంభించిన డోర్సే గతేడాది నవంబర్లో సీఈవో బాధ్యతల నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.






