ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. 2024 వరకు
ఆర్థిక మాంద్యం 2024 మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాపడ్డారు. ఇది కేవలం తన అంచనా మాత్రమేనని తెలిపారు. చైనా, ఐరోపాలో ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితుల మూలంగా టెస్లా విద్యుత్ వాహనాల అమ్మకాలు తగ్గాయని మస్క్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మాంద్యంపై ఇటీవల కాలంలో అనేకసార్లు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థూల ఆర్థిక వ్యవస్థలోని అస్థిరత వల్ల విద్యుత్ వాహనాలకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలోను ఆయన ఆర్థిక వ్యవస్థపై తాను చాలా నిరాశతో ఉన్నట్లు తెలిపారు.






