ప్రవాసులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండయా యూఏఈలోని భారత ప్రవాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రవాసులు అతి తక్కువ ధరకే స్వదేశానికి వచ్చే వెసులుబాటు కల్పించింది. యూఏఈ నుంచి భారత్లోని ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి గమ్యస్థానాలకు వన్వే టిక్కెట్ ధర కేవలం 330 దిర్హమ్స్ (రూ.7,147)గా నిర్ణయించింది. వన్ ఇండియా వన్ పేర్లో భాగంగా ఎయిరిండియా ఎయిర్లైన్ అన్ని గల్ఫ్ స్టేషన్ల నుండి (ఒమన్ మినహా) భారత్లోని ఏ గమ్యస్థానానికి అయినా అన్ని డైరెక్ట్ విమానాలలో ఆకర్షణీయమైన వన్-వే ఛార్జీలు అందిస్తుంది. ఇక ఈ ప్రమోషన్ పీరియడ్లో భాగంగా అక్టోబర్ 15 వరకు విక్రయించే అన్ని టిక్కెట్లపై ప్రయాణికులకు చెన్ ఇన్ బ్యాగేజీ అలవెన్స్గా 35 కిలోలు, 8 కిలోల హ్యాండ్ గేజీని తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.






