ఇది మా ప్రధానమైన అంశాల్లో ఒకటి : అమెరికా
జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అంశం చర్చకు వస్తుందని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసిది. ఇది తమ మిత్రులు, భాగస్వాముల చర్చల్లో తరచుగా వచ్చే అంశమని పేర్కొంది. అధ్యక్ష హోదాలో భారత్ సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఈ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా జీ-20 నేతలంతా ఈ సమావేశానికి రానున్నారు. చైనా, రష్యా అధ్యక్షులు కూడా పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మిత్రులు, భాగస్వాములతో జరుగుతున్న సంభాషణలన్నింటిలోనూ, ఉయ్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తూనే ఉంటాం. ఇది మా ప్రధానమైన అంశాల్లో ఒకటి. జీ-20లో కూడా ఇది ఉంటుంది అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ప్రకటించారు.






