జో బైడెన్ బృందంలో సమీరా ఫాజిలి
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్ మూలాలు ఉన్న సమీరా ఫాజిలికీ జాతీయ ఆర్థిక మండలి (ఎన్ఈసీ)లో చోటు లభించింది. ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్గా ఆమె కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆమె నియామకానికి సంబంధించి బైడెన్ బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్లోని విలియమ్స్విల్లేలో సమీరా ఫాజిలి జన్మించారు. ఆమె తల్లిదండ్రులు యూసఫ్, రఫీకా ఫాజిలూ. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె.. హార్వర్డ్ కాలేజీ, యేల్ లా స్కూల్ నుంచి ఉన్నత విద్య పూర్తి చేశారు. యేల్ లా స్కూళ్లో లెక్చరర్గా కేరీర్ ఆరంభించిన ఆమె కన్జూమర్, హౌజింగ్, చిరు వ్యాపారాలు, మైక్రోఫైనాన్స్ తదితర విభాగాల్లో పని చేశారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుచరురాలిగా గుర్తింపు పొందారు. ఇక సమీర ఫాజిలి గతంలో.. అల్లాంటా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆర్థికాభివృద్ధి డైరెక్టర్గా పనిచేశారు. అలాగే ఎన్ఈసీ సీనియర్ పాలసీ అడ్వైజర్గా విధులు నిర్వర్తించారు. ఒబామా హయాంలో డొనెస్టిక్ ఫినాన్స్, విదేశీ వ్యవహారాల సీనియర్ అడ్వైజర్గా బాధ్యతలు నెరవేర్చారు. ఇక ఇప్పుడు అమెరికాలో కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులు కానున్నారు.






