కాలిఫోర్నియాలో సంఘీభావ ర్యాలీ

ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో వందలాది మంది సిక్కు అమెరికన్లు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేశారు. కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరసనకారులు శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్కు కార్ల ర్యాలీ నిర్వహించారు. వారి వాహన శ్రేణితో బే బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభించింది. ఇండియానా పొలిస్లో సైతం వందలాది మంది ప్రదర్శన జరిపారు. న్యూయార్క్, హ్యూస్టన్ మిషిగాన్, షికాగో, వాషింగ్టన్ నగరాల్లో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు లేకపోతే ఆహారం లేదు. రైతులను కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ చట్టాలు రైతులను పేదరికంలోకి నెట్టేసాయని, కార్పొరేట్ కంపెనీలకు గుత్తాధిపత్యం కట్టబెడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశానికైనా రైతులే ఆత్మ. మనం ఆత్మను కాపాడుకోవాలి. భారత్లో కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని అమెరికా, కెనడా సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారని ఇండియానాకు చెందిన గురీందర్ సింగ్ ఖల్సా అన్నారు. భారత ప్రభుత్వానికి సృష్టమైన సందేశం ఇవ్వాలనే నిరసన చేపట్టామని అమన్దీప్ సింగ్ హుండల్ చెప్పారు.