Bhatti Vikramarka: వారికి ఎంతో కొంత సాయం చేస్తాం : భట్టి విక్రమార్క

సివిల్స్కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్గాంధీ సివిల్స్ (Civils) అభయహస్తం పథకం కింద సివిల్స్ -2025లో మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష చెక్కులను మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) తో కలిసి ఆయన పంపిణీ చేశారు. సింగరేణి(Singareni) సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ -2024 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం (Abhayahastam Scheme) ద్వారా అభ్యర్థులకు సాయం అందిస్తామన్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా రెండో సంవత్సరం అమలు చేస్తున్నామన్నారు. సివిల్స్ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సాయం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.