Vanguard: హైదరాబాద్ లో వాన్గార్డ్ కేంద్రం

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ వాన్గార్డ్ (Vanguard ) భారత్లో తొలి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్(Hyderabad) లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సెంటర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అయితే ఈ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడులు, ఎంతమంది ఉద్యోగులను నియమించుకుంటుందనే విషయాలను మాత్రం వాన్గార్డ్ వెల్లడిరచలేదు. వాన్గార్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ అధికారిగా ఉన్న వెంకటేష్ నటరాజన్ (Venkatesh Natarajan) మాత్రం హైదరాబాద్ కేంద్రం అధిపతిగా వ్యవహరించనున్నారని కంపెనీ తెలిపింది. 1975లో కార్యకలాపాలు ప్రారంభించిన వాన్గార్డ్ ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగా క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ సలహా సేవలు అందిస్తోంది.