Jubilee Hills: జూబ్లీహిల్స్ తీర్పుతో రాష్ట్రంలో ఆ పార్టీకి చోటులేదు: మహేశ్కుమార్ గౌడ్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగరవేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు. ఈ విజయం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అంకితం. జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు బీఆర్ఎస్ (BRS) పార్టీకి సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి చోటులేదని మరోసారి రుజువైంది. రానున్న రోజుల్లోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుంది. నవీన్ను గెలిపించిన ఘనత సీఎం(CM) , మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది అని అన్నారు.






