Krishnaveni :త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణికి చేయూత

ఏషియన్ పారా త్రో బాల్(Throwball) చాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన నిరుపేద పారా ప్లేయర్ మాచర్ల కృష్ణవేణి (Krishnaveni )కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేతుల మీదుగా ఎన్ఆర్ఐ హరీశ్ రెడ్డి( Harish Reddy) ఆర్థిక సాయం అందించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కృష్ణవేణి మార్చి 28 నుంచి 30 వరకు కాంబోడియాలో జరిగే త్రోబాల్ పోటీల్లో పాల్గొననున్నది. రవాణా, హోటల్, ఫుడ్, రిజిస్ట్రేషన్, కోచింగ్, దుస్తులు, ప్రవేశ రుసుం వంటి ఖర్చులకు గాను రూ.89 వేలు చెల్లించాల్సి ఉంటుందని, దాతలు సహకరించాలంటూ ఆమె తెలిపారు. ఈ విషయం బీఆర్ఎస్ నాయకులు ఎన్ఆర్ఐ హరీశ్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన ఆర్థిక సహాయాన్ని హైదరాబాద్లో కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కృష్ణవేణిని అభినందించారు.