Ramachandra Rao: ఈ తీర్పు మంచి పరిణామం : రామచందర్రావు

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ తీర్పు మంచి పరిణామమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర చేస్తోందో, జనాల్ని మోసం చేసే పాదయాత్ర చేస్తుందో చెప్పాలన్నారు. ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చిందో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేస్తే కాంగ్రెస్కు పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటుందన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు.