ఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణలోని వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఇన్ప్లూయెంజా లక్షణాలు (జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి) ఊపిరితిత్తుల న్యుమెనియా వంటి రెండు లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని మంత్రి వైద్య సిబ్బందిని కోరారు. అనంతరం కరోనాకు సంబంధించి గ్రామాల్లో పట్టణాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ పలువురు ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లతో మాట్లాడారు.






