Revanth Reddy: వీటి నిరోధానికి సిట్ ఏర్పాటు చేయాలి : సీఎం రేవంత్ ఆదేశం

ఆన్లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్ (Online betting) , రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీటి నిరోధానికి, నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ( సిట్) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిరచారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ (Rummy) ప్రచారం కల్పించినవారిని విచారించాం. ప్రచారం కల్పించినవారిని విచారించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదు. సిట్ (Sit) ఏర్పాటు చేసి వీటికి అడ్డకట్ట వేయాలని నిర్ణయించాం. ఆన్లైన్ బెట్టింగ్, నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవు అని హెచ్చరించారు.