బ్లాక్ ఫంగస్ పై తెలంగాణ ప్రభుత్వం.. కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్పై కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసి)ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన బాధితుల సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ప్రతిరోజు రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.