Ramachandra Rao: హైదరాబాద్లో చేసినట్లే ఢిల్లీ కి వెళ్లి నాటకాలు : రామచందర్రావు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ పూర్తి మద్దతిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లో కాంగ్రెస్ ధర్నా (Congress dharna) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చేసినట్టే ఢిల్లీ (Delhi) కి వెళ్లి నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఇవ్వడం ఇష్టం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం ఇస్తామని చెప్పలేదు. బీసీలకే 42 శాతం అమలు చేస్తామంటే పూర్తి మద్దతిస్తాం. ముస్లింలకు 10 శాతం ఇస్తే, 10 శాతం బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లను బీజేపీ (BJP) అడ్డుకుంటోందని ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ను బీసీలు నమ్మరు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదు అని అన్నారు.