RTC Workers :తెలంగాణ ఆర్టీసీ కార్మికులు … సమ్మె నోటీసులు

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు (Strike notices) ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీ (PRC)ల అమలు, సీసీఎస్, పీఎఫ్(PF) డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లింపు తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్భవన్ వద్దకు చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.