High Court : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) కి హైకోర్టు (High Court ) లో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెం ( Kothagudem ) లో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగం వల్ల బీజేపీ (BJP) పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు (Kasam Venkateswarlu) ఫిర్యాదు చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.