నాచారంలో రహేజా విస్తాస్

హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ జోరందుకోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహేజా కార్ప్ హైదరాబాద్లో మరో టవర్ను ప్రారంభించింది. నాచారంలో రహేజా విస్తాస్లో ఇప్పటికే 3 టవర్లను నిర్మించి, విక్రయించిన ఈ సంస్థ తాజాగా నాల్గో టవర్ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 12 అంతస్తుల ఈ నిర్మాణంలో 2, 3 పడక గదుల గహాలుంటాయని, ఈ ప్రాజెక్ట్కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు లభించిందని కంపెనీ ఆ ప్రకటనలో వివరించింది.