Nalgonda Court : నల్గొండ కోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ (Pranay) హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్కుమార్ శర్మ (Subhash Kumar Sharma )కు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడిరచింది. తన కుమార్తె అమృత (Amrita)ను కులాంత వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు(Maruthi Rao) 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం, విచారణ చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేసింది. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా, ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2 సుభాష్కుమార్ శర్మ , ఏ3 అస్గర్అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాం లు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉండగా, అస్గర్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు.