LRS : ఎల్ఆర్ఎస్ రాయితీ గడువును పొడిగించిన తెలంగాణ

లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ( ఎల్ఆర్ఎస్) (LRS) రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పొడిగించింది. ఏప్రిల్ (April) నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా పెండిరగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ (Registration) చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్ ఫీజను 25 శాతం రాయితీతో చెల్లించేందుకు మార్చి (March) 31 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడవును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్నంతమేర స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుంది.