KCR: బండెనుక బండి కట్టి .. పోదాము రారన్నో.. పాట విడుదల చేసిన కేసీఆర్

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ వేళ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) పాటను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) పాట రచించి పాడారు. బండెనుక బండి కట్టి పోదాము రారన్నో అంటూ రసమయి బాలకిషన్ రాసి, పాడిన పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ అవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రస్థానంపై పాటలు, కళారూపాలు రూపొందించాలని రసమయి బాలకిషన్కు కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) , మాజీ మంత్రి హరీశ్రావు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొన్నారు.