ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జపాన్ కాన్సుల్ జనరల్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో (Takahashi Muneo) మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. చెన్నై కేంద్రంగా పనిచేసే జపాన్ కాన్సులేట్ తెలంగాణతో కొనసాగిస్తోన్న సంబంధాలు, నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ఈ సందర్భంగా టకాహషి ప్రస్తావించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి(RPO) జొన్నలగడ్డ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.