CP Sajjanar : వారిపై దాడులు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేస్తే ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరించారు. పోలీసు (Police) అధికారులు, ఉపాధ్యాయులు (Teachers) , ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. దాడులకు పాల్పడినవారిపై 221, 132 121 (1) సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. ఒకసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉందని, పాస్పోర్టు జారీ, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయన్నారు. కక్షికావేశంలో ఏ చిన్నతప్పు చేసినా జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుందని సీపీ హెచ్చరించారు.






