Harish Rao : ఆర్ఎంపీ, పీఎంపీలపై వేధింపులు ఆపాలి : హరీశ్రావు

ఆర్ఎంపీ, పీఎంపీలపై వేధింపులు ఆపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు ధర్నాకు దిగారు. ఆర్ఎంపీ(RMP), పీఎంపీల (PMP)పై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. తమకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, హెల్త్ గైడ్లుగా గుర్తించాలని కోరారు. గ్రామీణ వైద్యులకు మద్దతుగా హరీశ్రావు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఆర్ఎంపీ, పీఎంపీలను భయపెడుతోందని మండిపడ్డారు. వారిపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు బీఆర్ఎస్ (BRS) అండగా ఉంటుందని తెలిపారు.