Guvvala Balaraju :బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) బీజేపీ (BJP) లోకి చేరారు. నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పరిస్థితి సున్నా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీకి 2023 ఎన్నికల్లో 13.9 శాతం ఓట్లు వచ్చాయని 2024లో 36 శాతం ఓట్లు వచ్చాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీయర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు.







