మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను (ఐటీ) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటే కరీంనగర్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్లోని పంజాగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్స్, హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలో సోదాలు జరిగాయి. కరీంనగర్లో గంగుల కమలాకర్ ఇంటితో పాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎన్వీఆర్ గ్రానైట్స్లో ఐటీ, ఈడీ సోదాలు నిర్వహించారు. గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి ఈడీ, ఐటీ అధికారులు లోనికి ప్రవేశించారు.
గ్రానైట్ వ్యాపారి అరవింద్వ్యాస్తో పాటు మరికొంత మంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరిగాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సుమారు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనికీలు చేశారు. గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలించారు.






