కవిత సంచలన నిర్ణయం

భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా , మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కవిత తెలిపారు. కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని కవిత స్పష్టం చేశారు. అయితే కమిటీల రద్దుకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలో టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చారు కవిత. ఈ క్రమంలోనే భారత్ జాగృతి కమిటీలను వేశారు. పలు రాష్ట్రాలకు కూడా కమిటీల బాధ్యలను ప్రకటించారు.