Uttam Kumar Reddy: పెట్టుబడులు పెట్టేందుకు డెన్మార్క్ ముందుకు రావాలి: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు డెన్మార్క్ ముందుకు రావాలని ఆ దేశ ప్రతినిధులను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కోరారు. డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ (Rasmus Christensen) హైదరాబాద్లో ఉత్తమ్కుమార్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చించారు. ఈ రంగాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చించారు. ఈ రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆకాంక్షించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ (Hyderabad) ఒకటని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణ విశిష్టతను రాస్మస్ క్రిస్టేన్సన్కు వివరించారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధునిక వసతులు, ఫార్మా రంగంలో పురోగతిని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారని మంత్రి తెలిపారు.