Gandhi Bhavan: గాంధీభవన్లో కాంగ్రెస్ సంబరాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయం దిశగా దూసుకెళ్తోంది. రౌండ్ రౌండ్కూ ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఆధిక్యం పెరుగుతోంది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఏ రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) ఆధిక్యంలోకి రాలేదు. కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయం కావడంతో గాంధీభవన్ (Gandhi Bhavan) వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పెద్ద పెత్తున నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాణసంచా కాల్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. సోనియా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు.






