Gautam Adani : హైదరాబాద్కు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) హైదరాబాద్కు వచ్చారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తన కుమారుడు కరణ్ అదానీ (Karan Adani) తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అదానీని ప్రతిమ గ్రూప్ చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు (Boinapalli Srinivasa Rao) ( ప్రతిమ శ్రీనివాసరావు) ఆహ్వానించడంతో ఆయన ఇంటికెళ్లారు. అక్కడ శ్రీనివాసరావు ఇచ్చిన తేనీటి విందును అదానీ స్వీకరించారు. అంతకుముందు ప్రతిమ శ్రీనివాసరావు కుమార్తెలు డాక్టర్లు హరిణి(Harini), హసినీ(Hasini )లు అదానీకి స్వాగతం పలికారు.