Bandi Sanjay: మేధావి వర్గం అంతా మా పార్టీకే : బండి సంజయ్

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party )ని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దు అనుకున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. తెలంగాణ (Telangana) లో కూడా అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ (MLC) స్థానాల్లో బీజేపీ (BJP) విజయం సాధిస్తుంది. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలి. శాసనసభలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజపీ ఒక్కటే అని అన్నారు.