Raj Bhavan:రాజ్భవన్ లో ఎట్హోం కార్యక్రమం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు గవర్నర్, సీఎం వెళ్లి పలకరించారు.