Owaisi: భవిష్యత్తులో తెలంగాణలోనూ ..బీహార్ తరహాలో : ఓవైసీ
భారతదేశం ఏ ఒక్కరి అయ్య జాగీరు కాదని ఎంఐఎం (MIM) శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) స్పష్టం చేశారు. అసెంబ్లీ (Assembly)లో ఓవైసీ మాట్లాడుతూ హిందు, ముస్లిం, సిక్కు ఇలా అన్ని మతాల వారినీ గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సర్ ప్రక్రియను తీవ్రంగా విమర్శించారు. కొత్త నిబంధనలు, సర్వేల పేరుతో ఓట్లను తొలగించి సామాన్య ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ ఓటర్ల జాబితా సవరణను అమలు చేయనున్నారని, బీహార్ (Bihar) తరహాలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు లేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. పాక్, బంగ్లా దేశస్తులకు ఓటు హక్కు కల్పించాలని తాము చెప్పడం లేదని, అర్హులైన భారతీయ పౌరుల ఓట్లను తొలగించడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఓవైసీ పునరుద్ఘాటించారు.






