ఏపీలో ఇద్దరు ఐఏఎస్ లకు.. జైలు శిక్ష

36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆంధప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్రంలోని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నేటి విచారణకు ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేసిన హైకోర్టు వారిద్దరికీ వారంపాటు జైలు శిక్ష విధించింది. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు సైతం జైలు శిక్ష విధించింది.