ASBL NSL Infratech

11వ రోజు కొనసాగుతున్న వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర

11వ రోజు కొనసాగుతున్న వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి 11వ ప్రజాసంకల్పయాత్ర  ప్రారంభమైంది. ఆయన ఈ రోజు ఉదయం 8 గంటలకు దొర్నిపాడు నుంచి పాదయాత్రను ఆరంభించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి.

ఆపై ఉయ్యాలవాడ క్రాస్‌ రోడ్‌ మీదుగా భీమునిపాడు వద్దకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత భోజన విరామం తీసుకుని తర్వాత యాత్ర కొనసాగిస్తారు. పెరా బిల్డింగ్స్‌, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వయా కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వద్దకు చేరుకోగానే పాదయాత్ర ముగుస్తుంది. అక్కడే ఆయన రాత్రి బస చేస్తారు.

కాసేపట్లో కంపళ్లమెట్టకు చేరుకోనున్న ప్రజాసంకల్పయాత్ర..
ఉయ్యాలవాడ క్రాస్ రోడ్డు,భీమునిపాడు,కోవెలకుంట్ల మీదుగా యాత్ర..
కర్నూలు జిల్లా--కంపమెళ్లమెట్ట చేరుకున్న శ్రీ వైయస్ జగన్..
శ్రీ వైయస్ జగన్ కు ఘనస్వాగతం పలికిన గ్రామస్ధులు..
శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కు బ్రహ్మరధం..
అడుగడుగునా శ్రీ వైయస్ జగన్ కు జననీరాజనాలు..

కర్నూలు జిల్లా--వైయస్ ఆర్ సీపీ లోకి టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు..
శ్రీ వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రామిరెడ్డి..
రామిరెడ్డి తో పాటు పార్టీలోకి కోవెలకుంట్లకు చెందిన 25 మంది కీలక నేతలు..

వైయస్ జగన్ ను కలిసిన మహిళా రైతు కూలీలు..

కూలీ రెేట్లు గురించి అడిగి తెలుసుకున్న శ్రీ వైయస్ జగన్..
రైతుల రుణమాఫీ గురించి అడిగిన శ్రీ వైయస్ జగన్..
ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని వాపోయిన రైతులు..
తాము అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని శ్రీ వైయస్ జగన్ హామీ..

వైయస్ జగన్ ను కలిసిన మహిళా రైతు కూలీలు..

కూలీ రెేట్లు గురించి అడిగి తెలుసుకున్న శ్రీ వైయస్ జగన్..
రైతుల రుణమాఫీ గురించి అడిగిన శ్రీ వైయస్ జగన్..
ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని వాపోయిన రైతులు..

కోవెలకుంట్ల చేరుకున్న శ్రీ వైయస్ జగన్,స్వాగతం పలికిన విద్యార్ధులు..

అడుగడుగునా శ్రీ వైయస్ జగన్ కు జననీరాజనాలు..
వైయస్ జగన్ రాకతో భారీగా తరలివచ్చిన జనం..

వైయస్ జగన్ ను కలిసిన  పీడబ్ల్యూడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు..

తమ సమస్యలపై శ్రీ జగన్ కు వినతిపత్రం ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులు..
కర్నూలు జిల్లా--కోవెలకుంట్లలో శ్రీ వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర..
శ్రీ వైయస్ జగన్ ను కలిసిన రజకులు..
తమను ఎస్సీ లో చేర్చాలని శ్రీ వైయస్ జగన్ ను కోరిన రజకులు..

Click here for PhotoGallery

Tags :