India : పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే.. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం : భారత్

భారత్లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) రూ.182 కోట్ల నిధులను కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఓటింగ్ను పెంచడం ద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యూఎస్ఎయిడ్ (USAID) ప్రయత్నించిందనే వార్తలు తీవ్ర కలవరపాటు గురిచేస్తున్నాయని పేర్కొంది. దీనిపై సంబంధిత విభాగాలు దృష్టి సారించాయని వెల్లడిరచింది. యూఎస్ కార్యకలపాలు, నిధులకు సంబంధించి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం వెల్లడిరచిన సమాచారాన్ని చూశాం. అవి తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళనలకు దారితీశాయి. ఈ దశలో దీనిపై బహిరంగంగా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. సంబంధిత అధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal )వెల్లడిరచారు.