Parliament: పార్లమెంటు ఆవరణలో అరుదైన దృశ్యం

అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పార్లమెంటు ఆవరణలో మహాపరినిర్వాణ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad), ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్(Ambedkar) చిత్రపటానికి వారు నివాళులర్పించారు. అనంతరం మోదీ, ఖర్గే (Modi, Kharge) పరస్పరం పలకరించుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఎప్పుడూ పరస్పర విమర్శలు చేసుకొనే నేతలు ఒకేచోట అలా నవ్వుతూ మాట్లాడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.