PM Modi: చంద్రబాబు, పవన్లతో మోదీ ప్రత్యేక భేటీ

ఢిల్లీ కొత్త సీఎంగా గురువారం నాడు బీజేపీ నేత రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లతో మోదీ (PM Modi) ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని మోదీ ఆరా తీశారు. అమరావతి పనుల స్థితిగతులను కూడా అడిగి తెలుసుకున్న ఆయన (PM Modi).. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇవ్వగా చంద్రబాబు, పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్యం బాగలేకపోవడం వల్లనే గత ఎన్డీయే సమావేశాల్లో తను పాల్గొనలేదని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. ఇప్పటికీ తాను వెన్నునొప్పితో బాధపడుతూనే ఉన్నట్లు చెప్పిన పవన్.. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, అన్ని హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.