Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » India the epicenter of global health highlights from the international health dialogue hosted by apollo hospitals

Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ నిర్వహించిన అంతర్జాతీయ హెల్త్ డైలాగ్ నుండి ముఖ్యాంశాలు

  • Published By: techteam
  • February 26, 2025 / 08:20 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
India The Epicenter Of Global Health Highlights From The International Health Dialogue Hosted By Apollo Hospitals

 

Telugu Times Custom Ads

అపోలో హాస్పిటల్స్(Apollo Hospitals) నిర్వహించిన అంతర్జాతీయ హెల్త్ డైలాగ్  (IHD) 2025, ఆధునిక ఆరోగ్య సంరక్షణ సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలపై దృష్టి సారించి ఆరోగ్య సంరక్షణ నాయకులు మరియు విధాన రూపకర్తల ముఖ్యమైన సమావేశంగా గుర్తించబడింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ఇండియా డిజిటల్ హెల్త్ యాక్టివేటర్‌ను కూడా ప్రారంభించారు.

భారత ప్రభుత్వ ఆరోగ్య&కుటుంబ సంక్షేమం&రసాయనాలు&ఎరువుల శాఖ గౌరవ మంత్రి శ్రీ జె.పి. నడ్డా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మానవ-కేంద్రీకృత సంరక్షణతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంరక్షణ విప్లవానికి నాయకత్వం వహించడానికిభారతదేశం సిద్ధంగా ఉంది. IHD 2025 యొక్క లక్ష్యం, మన జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటంతో పాటుగా ఇండియా మరియు అంతకు మించి ఆరోగ్య సంరక్షణ సేవలను చేరువ చేయటం, అందరికి అందుబాటులో ఉంచటం మరియు నాణ్యమైన సేవలను అందించటం పెంచుతుంది ” అని అన్నారు.

IHD 2025 బహుళ ప్రత్యేక వేదికలను ఏకతాటిపైకి తీసుకువచ్చింది. 12వ అంతర్జాతీయ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ (IPSC) రోగుల భద్రత మరియు సంరక్షణ మెరుగుదల చర్యలను చర్చించడానికి సుదీర్ఘ వేదికను అందించింది, అదే సమయంలో టెక్నాలజీ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ (THIT) సదస్సు WEF ఇండియా డిజిటల్ హెల్త్ యాక్టివేటర్ ప్రకటనకు వేదికగా నిలిచింది.

అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, మాట్లాడుతూ “ఆరోగ్య సంరక్షణకు హద్దులు లేని భవిష్యత్తును సృష్టించడానికి మనం ఆవిష్కరణ మరియు కరుణ రెండింటినీ స్వీకరించాలి” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సాంకేతిక పురోగతిని అవసరమైన మానవ స్పర్శతో సమతుల్యం చేయడంపై కార్యక్రమ లక్ష్యం నొక్కిచెప్పాయి.

అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీత రెడ్డి ఈ రంగంలో జరుగుతున్న విస్తృత మార్పులను వివరిస్తూ, “ ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మార్పునకు లోనవుతుంది . మా ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో, సంరక్షణను అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మరియు ప్రయోజనకరంగా మార్చడానికి మేము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము. ఏఐ , వేరబల్స్ వంటి అధునాతన సాధనాలను మేము అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ, మానవ స్పర్శ తప్పనిసరి. మనం వేగంగా, ఖచ్చితంగా మరియు నిజమైన కరుణతో వ్యవహరించాలి” అని అన్నారు.

ఈ దార్శనికతను అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి బలపరుస్తూ  “అపోలో వద్ద , మా లక్ష్యం స్పష్టంగా ఉంది: ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటంతో పాటుగా సరసమైనదిగా ఉండాలి. మేము వ్యాక్సిన్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము మరియు తాజా సాంకేతికతలను స్వీకరిస్తున్నాము. ఏదో రోజు, ఈ ప్రపంచం నిజమైన మరియు ప్రభావవంతమైన సంరక్షణ కోసం భారతదేశం వైపు చూస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.

ఆరోగ్య వ్యవస్థల పరిణామం గురించి డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ  “మేము ప్రక్రియ-ఆధారిత విధానం నుండి వాస్తవ ఫలితాలపై దృష్టి సారించిన విధానం వైపు వెళ్తున్నాము. మా నమూనా నైతిక ఏఐ , బలమైన డిజిటల్ భద్రత , వేగవంతమైన జన్యు పరీక్షలను ఏకీకృతం చేస్తుంది. యాంబియంట్ లిజనింగ్ మరియు రోబోటిక్స్ వంటి సాంకేతికతలను చేర్చడం ద్వారా, సంరక్షణలో అవసరమైన మానవ అంశాన్ని భర్తీ చేయడానికి బదులుగా సాంకేతికత మద్దతు ఇస్తుందని మేము నిర్ధారిస్తాము” అని అన్నారు.

వైద్య ఆవిష్కరణలో భారతదేశం యొక్క పురోగతిని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడిస్తూ, “భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధించింది. మనము వైద్యం మరియు చికిత్సకు ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందాము. అనేక స్టార్టప్‌లు మరియు స్వదేశీ ఆవిష్కరణలతో – మన స్వంత యాంటీబయాటిక్ పురోగతి నుండి మొబైల్ టెలికన్సల్టేషన్ క్లినిక్‌ల వరకు – మన బయోటెక్నాలజీ రంగం వేగంగా విస్తరిస్తోంది.  ఈ ఆచరణాత్మక, ఆర్థిక-ఆధారిత పరివర్తన అందరికీ ఆరోగ్య సంరక్షణను పునర్నిర్మిస్తోంది” అని అన్నారు.

అపోలో హాస్పిటల్స్ అధ్యక్షుడు మరియు సీఈఓ డాక్టర్ మధు శశిధర్ మాట్లాడుతూ ఏఐ -ఆధారిత క్లినికల్ ట్రయల్స్ ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేస్తున్నాయని మరియు వ్యాధి గుర్తింపు రేటును మెరుగుపరుస్తున్నాయని వెల్లడించారు . “ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడం , ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడం ద్వారా ఏఐ మా క్లినికల్ ట్రయల్స్‌ను మారుస్తోంది. అయితే, ఈ ఆవిష్కరణలు నైతికంగా, సురక్షితంగా మరియు నిజంగా రోగి-కేంద్రీకృతంగా ఉండేలా చూసుకోవడానికి మేము బలమైన పాలనా విధానాలను ఏర్పాటు చేయడం చాలా అవసరం” అని ఆయన అన్నారు.

రెండవ రోజు డైలాగ్ లో కార్యాచరణ వ్యవస్థలు మరియు రోగి సంరక్షణ పంపిణీలో మరిన్ని మెరుగుదలలను అన్వేషించారు. ఈ సెషన్‌లను గురించి డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ , “ఈ వేదిక ప్రపంచాన్ని స్వస్థపరచడానికి మరియు సహాయం చేయడానికి ఒక దృక్పథంతో సమాచారం మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి మాకు సహాయపడుతుంది. ఇది మన ఆరోగ్య సంరక్షణ దౌత్యంలో భారతీయ ఆరోగ్య సంరక్షణ నిపుణుల పాత్రను కూడా గుర్తిస్తుంది. జ్ఞానం, ఆలోచనలు, సాంకేతికత మరియు మెరుగైన విధానాలను పంచుకోవడం ద్వారా, మెరుగైన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.

గౌరవనీయులైన భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ  “స్పెషాలిటీ ఆసుపత్రుల నుండి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల వరకు, కోవిడ్-19 మహమ్మారి మరియు అంతకు మించి మేము అర్థవంతమైన ప్రభావాన్ని చూపడానికి కృషి చేసాము. మన వైద్య నైపుణ్యాన్ని పంచుకోవడం ఎల్లప్పుడూ మన ప్రపంచ విధానంలో కీలకమైన భాగం. IHD ద్వారా అందరికీ సమానమైన మరియు అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను సాధించడంలో భారతదేశం ప్రపంచ సహకారానికి కేంద్రంగా ఉద్భవించింది” అని అన్నారు.

IHD 2025 ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సాంకేతిక నిపుణులు మరియు విధాన రూపకర్తల మధ్య ఆచరణాత్మక సంభాషణ కోసం ఒక వేదికను అందించింది. ఈ కార్యక్రమం వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ మరింత అందుబాటులో, సమర్థవంతంగా మరియు రోగి-కేంద్రీకృతంగా ఉండే భవిష్యత్తును భాగస్వామ్య ప్రయత్నాలు ఎలా నడిపిస్తాయో సమగ్ర దృక్పథాన్ని కూడా అందించింది.

 

 

 

Tags
  • Apollo Hospitals
  • Global Health
  • India

Related News

  • Priyanka Gandhi Critisised Pm Modi On Manipur Visit

    Priyanka:మన ప్రధానుల  సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు

  • Supreem Court Dismissed Kangana Ranaut Plea On Deamation Case

    Kangana Ranaut: కంగనా రనౌత్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • Cp Radhakrishnan Takes Oath As 15th Vice President Of India

    Vice President: ఉపరాష్ట్రపతిగా సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణం

  • Vice President Elect Cp Radhakrishnan Takes Oath

    Vice President: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

  • Mea On Indians Recruited Into Russian Army

    Randhir Jaiswal: ఆ ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం అలర్ట్‌

  • Cp Radhakrishnan To Take Oath As India Vice President On September 12

    Vice President:ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

Latest News
  • Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
  • Mirai: సినిమాలో మ్యాట‌రుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
  • Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
  • Jagapathi Babu: రాజ‌కీయాల్లోకి వ‌స్తే నేనే హీరోను
  • YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
  • Priyanka:మన ప్రధానుల  సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
  • DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు  ఇస్తున్నాం : డీజీపీ
  • MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు :  ఎమ్మెల్సీ భూమిరెడ్డి
  • PVN Madhav: వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు : పీవీఎన్‌  మాధవ్‌
  • ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer