Ram Temple : అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆరోగ్యం విషమం!

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Satyendra Das) (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో లఖ్నవూ(Lucknow )లోని ఆస్పత్రి(Hospital)లో చేర్పించినట్లు తెలిపారు. సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆదివారం ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు వెల్లడిరచాయి. బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke) రావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. తాము అందిస్తున్న వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు (Babri Masjid) కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగతున్నారు.