Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ శిందే(Eknath Shinde) , ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్ (Ajit Pawar) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్లో అట్టహాసంగా జరిగినీ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Radhakrishnan) వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు చంద్రబాబు నాయుడు, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, భజన్లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముక్యమంత్రులు హాజరయ్యారు.