Modi:నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ?

అమెరికా, భారత్ మధ్య సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) మధ్య సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల చివర్లో మలేషియా (Malaysia) కౌలాలంపూర్లో 26, 27వ తేదీల్లో జరిగే 47వ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య ( ఆసియాన్) శిఖరాగ్రానికి ఇద్దరు నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వీరు సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమాచారం.సమావేశానికి రావాలంటూ మలేసియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ పర్యటన ఖరారైన పక్షంలో, అమెరికా భారత్ (India) పై 50 శాతం టారిఫ్లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం అవుతుంది.